కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి వద్ద వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో ఆలయ అర్చక గురుస్వామి రామస్వామి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలావిరాట్టును వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వచ్చిన భక్తులకు మహా మంగళ హారతులు ఇచ్చి, దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.