కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో దేవాంగ నగర్ కు చెందిన వైసీపీ కార్యకర్త రావూరి మరియబాబు మెదడు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కనిగిరి వైసీపీ ఇన్-ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, రూ. 25, 000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.