పోషణ పక్వాడా" కార్యక్రమాన్ని శుక్రవారం కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. గర్భిణీ, బాలింతలు, కిషోర బాలికలు, డ్వాక్రా సభ్యులకు.. ఐసీడీఎస్ సూపర్ వైజర్ పార్వతి పౌష్టికాహార వినియోగంపై అవగాహన కల్పించారు. పౌష్టికాహార పక్షోత్సవాల లోగోను ప్రదర్శించి, పౌష్టికాహారంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. రక్తహీనత, పోషక విలువలు పెంపునకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.