పామూరు మండలం వగ్గంపల్లి గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వర రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకాశం జిల్లా అధ్యక్షులైన షేక్ సైదా వెంకటేశ్వర రెడ్డి కి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అవకాశం కల్పించిన షర్మిల రెడ్డి, సైదా కు కృతజ్ఞతలు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.