చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలి చనిపోయిన పీసీ పల్లి మండలం కొత్తముద్దపాడు కి చెందిన జవాన్ నూకతోటి పవన్ కుమార్ మృతదేహం శుక్రవారం కొత్త ముద్దపాడుకు చేరుకుంది. పవన్ కుమార్ మృతదేహాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.