పిసిపల్లి మండలం కొత్త ముద్దపాడు గ్రామానికి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ నూకతోటి పవన్ కళ్యాణ్ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో కూబింగ్ నిర్వహిస్తుండగా మందుపాతర పేలి మరణించారు. విషయం తెలుసుకున్న కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం పవన్ కళ్యాణ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలన్నారు.