చంద్రశేఖరపురం మండలంలోని శైవక్షేత్రం భైరవకోనలో శుక్రవారం దుకాణాలకు బహిరంగ వేలం జరుగుతుందని ఆలయ వివో నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఫ్యాన్సీ దుకాణం, ఫోటోలు అమ్ముకొనుటకు కొబ్బరి చిప్పలు పోగు చేసుకొనుటకు వేలంపాట నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. వేలం పాటకు సంబంధించి పూర్తి అధికారం దేవస్థానం వారిదేనని, వేలం ఉదయము 10 గంటలకు నిర్వహించబడుతుందని తెలిపారు.