కనిగిరి శ్రీ దొంతులమ్మ ఆలయంలో పోలేరమ్మ తల్లి కలశ ఉత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. కనకదుర్గమ్మ కోవెల నుంచి మహిళలు 108 కలశాలలో గంగ జలాలతో ప్రదర్శన చేసి, ఆలయానికి చేరుకొని అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గోవిందరావు, కోటేశ్వరరావు, మాలకొండయ్య, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.