టంగుటూరు మండలం కందులూరు వద్ద శనివారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. కందులూరు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు విధులు ముగించుకొని ఒంగోలు వెళ్లుతుండగా అదే సమయంలో కందులూరుకు చెందిన స్వాములు బైక్పై వస్తుండగా ఢీకొన్నారు. గాయపడిన వారిని స్థానికులు ఒంగోలు రిమ్స్కు తరలించారు.