సీయస్ పురం మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రయాణికుల విశ్రాంతి షెల్టర్ న ఆదివారం కనిగిరి వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ ఏర్పాటు చేయటం పట్ల దాతలను అభినందించారు. ఎక్కువసేపు వేచియుండేందుకు ఉపయోగపడతాయని అన్నారు.