విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. మంగళవారం పామూరులోని స్థానిక సీఐ కార్యాలయంలోని పెండింగ్ కేసుల పరిష్కారం, నేర సమీక్షపై ఎస్ఐలు, సీఐలకు సమావేశ నిర్వహించారు. పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో నేర నియంత్రణపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.