కనిగిరి పట్టణం గార్ల పేట రోడ్డులో ఉన్న దొంతులమ్మ ఆలయంలోని పోలేరమ్మ తల్లి కలశ ఉత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని దొరువు వద్ద ఉన్న కనకదుర్గమ్మ దేవాలయం నుండి గంగాజలాలను 108 కలశాలలో నింపుతున్న భక్తులు పట్టణంలో ఊరేగింపు చేపట్టారు. పోలేరమ్మ తల్లి ఆలయం వరకు వెళ్లి అమ్మవారికి గంగాజలాలతో అభిషేకించారు.