జరుగుమల్లి మండల పరిధిలో శుక్రవారం రాత్రి ఆటో టిప్పర్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన జరిగింది. టంగుటూరు నుంచి జరుగుమల్లి వైపు వెళ్ళిన టిప్పర్ ను, జరుగుమల్లి నుంచి టంగుటూరు వెళ్ళే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బ్రహ్మయ్య (21)కి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది అతన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు.పూర్తివివరాలుతెలియాల్సి ఉంది.