సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ కి నాలుగు రోజుల పాటు పర్యాటకులు రాకుండా విరామం ప్రకటిస్తున్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య శనివారం తెలిపారు. గత గురువారం బీచ్ లో నలుగురు చనిపోవడంతో పాటు అలల ఉద్దృతి తగ్గకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా విరామం ప్రకటించినట్లు వివరించారు. పర్యాటకులు బీచ్ కు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడి వరకూ వచ్చిన వారిని కూడా వెనక్కు పంపిస్తున్నారు.