కొండేపి మండలంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సత్య నారాయణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోపు విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలన్నారు. ఈ నెల 24లోపు విద్యుత్ బిల్లులు చెల్లించి అపరాధ రుసుం బారిన పడకుండా ఏపీసీపీడీసీల్ వెబ్ సైట్ లో మాత్రమే చెల్లించాలని కోరారు.