సింగరాయకొండ: పిడుగుపాటుకు విగ్రహాలు ధ్వంసం

67చూసినవారు
సింగరాయకొండ: పిడుగుపాటుకు విగ్రహాలు ధ్వంసం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో బేసిన్ పాలెం లోని రామాలయం పై పిడుగు పడింది. గోపురం పై ఉన్న మూడు దేవత విగ్రహాలు పిడుగుపాటుకు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో పిడుగు పడ్డ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణా నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరి గోపురంపై పిడుగు పడటంతో కొన్ని విగ్రహాలు ధ్వంసమైనట్లుగా స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్