ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో సరాసరి ధర కేజీ రూ. 313. 79 పలికింది. ఎం నిడమానూరు క్లస్టర్ గ్రామాలకు చెందిన రైతులు 1041 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 965 కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 76 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర కేజీ రూ. 360, కనిష్ట ధర రూ. 205 పలికింది. వేలంలో మొత్తం 45 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.