పొదిలి పట్టణంలోని విశ్వనాధాపురం సమీపంలో సోమవారం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమానులు లేని సమయాన్ని చూసి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు దాదాపు రూ. 25 లక్షలు విలువచేసే బంగారాన్ని రెండు కేజీల వెండిని దొంగిలించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల వేలిముద్రలు సేకరిస్తున్నామని సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.