మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పొదిలిలోని పొగాకు బోర్డును గురువారం పరిశీలించారు. రైతులకు కల్పిస్తున్న గిట్టుబాటు ధరలను ఆయన పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారని అది నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు.