కురిచేడు మండలం కురిచేడు ఎస్సై ఎం. శివ మండల ప్రజలకు గురువారం ఉదయం పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురిచేడు పట్టణం, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.