హనుమంతునిపాడు మండలం ముప్పలపాడులో బుధవారం ఉపాధి కూలీలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.