విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతానికి వెళ్లి 3 గేదలు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. మార్కాపురం మండలం కోలభీమునిపాడు సమీపంలోకి రైతు సత్యనారాయణ రెడ్డి మేత కోసం గేదెలను తీసుకువెళ్లాడు. విద్యుత్ తీగలు నేలపై పడి ఉండగా అటువైపు వెళ్లిన గేదలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. రూ. 90 వేలు ఆర్థికంగా నష్టపోయినట్లుగా రైతు సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.