ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గురువారం జిల్లా ఎస్పీ దామోదర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సైలు సీఐలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే అంశంపై సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు నివారించే అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలను పోలీసు సిబ్బందికి ఎస్పీ దామోదర్ తెలిపారు.