ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుమల వెంకన్నను కుటుంబ సభ్యులతో పాటు స్థానిక నాయకులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలలో పాల్గొని అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈసారి నియోజకవర్గంలో సకాలంలో వర్షాలు కురవాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.