ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో శనివారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. టిడిపి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని స్థానిక సమస్యలపై నేరుగా తనను సంప్రదించి తెలియజేయవచ్చని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని ఎమ్మెల్యే చెప్పారు.