చేయి తడిపితేనే సంతకం!

70చూసినవారు
చేయి తడిపితేనే సంతకం!
తర్లుపాడు తహసీల్దార్‌ కార్యా లయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతిపనికి ఒకరేటు నిర్ణయించి ప్రజలను జలగల్లాగా పీక్కుతింటున్నారు. విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన క్యాస్ట్‌, నేటివిటీ, ఇన్‌కమ్‌ సర్టిఫికేట్లకు కూడా పైసలిస్తేనే సంతకం పెడతామని భీష్మించుకు కూర్చుంటున్నారు. మండలంలో గత ప్రభుత్వంలో జరిగిన ఫ్రీహోల్డ్‌ భూములకు కూడా ఎకరాకు రూ.30వేల చొప్పున వసూలు చేశారు. విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలకు రూ.500చొప్పున, ప్రాపర్టి సర్టిఫికెట్‌లకు రూ.5000, ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు రూ.2000, పట్టాదారు పాసుపుస్తకానికి రూ.10వేలు వసూలు చేస్తున్నారు. కొందరు విద్యార్థుల సర్టిఫికెట్‌లకు వీఆర్‌వో లు, డిప్యూటీ తహసీల్దార్‌లు సంతకాలు పెట్టినప్పటికీ తన వాట తనకు ఇవ్వంది సంతకం పెట్టేది లేదంటూ తహసీల్దార్‌ డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపణలు న్నాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో ఒక చిన్నపాటి ఉద్యోగి చేత డబ్బులు వసూలు చేయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్