తాళ్లూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఓ యువకుడు డాబా దిగుతూ జారిపడి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కొత్తపాలెం గ్రామానికి చెందిన చెరుకుపల్లి నరసింహారావు (35) ఇంటి డాబాపై నిద్రిస్తున్నాడు. మంచినీటి కోసం కిందకు దిగుతూ నిద్రమత్తులో డాబా అంచున కాలు వేసి జారీ పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.