మార్కాపురం: మూడు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేత

53చూసినవారు
మార్కాపురం: మూడు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేత
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ ప్రజలు ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ అధికారులు సోమవారం వెల్లడించారు. దూపాడు మంచినీటి ట్యాంకు సంబంధిత నీటి పైపు లైన్ మరమ్మత్తుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని కమిషనర్ నారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అసౌకర్యాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్