ఒంగోలులోని పివిఆర్ నగరపాలక బాలిక ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా భోజనం తింటున్న విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? లేదా? అని విద్యార్థులను ఆరా తీశారు. మెనూ చార్ట్ ను పబ్లిక్ గా డిస్ప్లే చేయాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. కోడిగుడ్లు, చిక్కిల రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.