పొదిలి విశ్వనాధపురంలో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన సదస్సు జరిగింది. కొనుగోలు చేసిన వస్తువుల తూకాలు సరిగా ఉన్నాయో లేదో వినియోగదారులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.