ఒంగోలు నగరంలోని కపాడిపాలెంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.