ఒంగోలు: రుణ సంబరం

67చూసినవారు
ఒంగోలు: రుణ సంబరం
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గత వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన కార్పొరేషన్‌కు పునరుజ్జీవం కల్పించింది. అర్హత ఉన్న వారికి రుణాల మంజూరుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గత సోమవారం నుంచి ప్రారంభించింది. అన్ని మండలాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆయా వర్గాల వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్