టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని 10, 13, 16, 18వ డివిజన్ల లోని టిడిపి నాయకులతో సోమవారం రాత్రి ఆయన సమావేశం నిర్వహించారు. కుటుంబ సాధికార సారథులను త్వరగా నియమించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.