ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చైల్డ్ ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో శుక్రవారం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే శుక్రవారం లోపు జిల్లా అంతటా చైల్డ్ ఆధార్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కావాలని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తే వివరాలు తెలుస్తాయన్నారు. ఐసిడిఎస్, మండల స్పెషల్ అధికారులు, ఎంపీడీవోలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.