టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని, పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఆదివారం రాత్రి టీడీపీ పార్టీ కార్యాలయంలో 9, 11, 12 వ డివిజన్ కార్యకర్తలతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయటంలో కుటుంబ సాధికార సారథుల నియామకం ఎంత ముఖ్యమో వివరించారు.