విపరీతంగా పెరిగిన కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సిపిఎం నేతలు శనివారం ఒంగోలులోని కూరగాయల మార్కెట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జి. రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలను ప్రజలకు అందించాలని కోరారు. నిత్యావసర వస్తువుల పెరుగుదలపై తనిఖీలు చేపట్టి వాటిని అదుపు చేయాలని కోరారు.