పొదిలిలోని శ్రావణి ఎస్టేట్ మార్గంలో మురుగునీటి సమస్యని స్థానికులు నగర కమిషనర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కమిషనర్ గురువారం కాలువలో ఉన్న పూడిక, మురుగునీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.