పొదిలి మండలంలో దొంగలు దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు. ఈగల పాడులోని సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం దొంగతనం చోటు చేసుకుంది. హుండీ పగలగొట్టి సుమారు రూ. 20 వేల నగదు దొంగలించినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.