రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

78చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వినాయక నిమజ్జనోత్సవానికి బాణసంచా తీసుకొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగులుప్పలపాడు మండలం టి.అగ్రహారంలోని ఎస్సీ కాలనీకు చెందిన తరుణ్‌(19), ప్రమోద్‌ ద్విచక్ర వాహనం పై మంగళవారం ఒంగోలు వెళ్లి సామగ్రి తీసుకుని తిరిగొస్తుండగా మద్దిరాలపాడు లోని కళాశాల వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా తరుణ్ ఒంగోలు లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్