చీమకుర్తి మండలం రామతీర్థం గంగమ్మ జాతర తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం పట్టణ జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిర్మించిన భారీ ప్రభను ఊరేగింపుగా దేవస్థానం వద్దకు తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన భారీ ట్రాలీపై 110 అడుగుల ప్రభకు పూజలు నిర్వహించి ఊరేగించారు. ప్రభను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.