భారత్ టీ 20 వరల్డ్ కప్ గెలవడంపై సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బివిఎస్ విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సంతనూతలపాడు మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 140 కోట్ల మంది ఆశలను టీం ఇండియా ఆటగాళ్లు సజీవంగా ఉంచుతూ చరిత్ర సృష్టించారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాగే అద్భుతంగా రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.