రంజాన్ పండుగ పురస్కరించుకొని చీమకుర్తిలో గురువారం ఈద్గా నందు ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లింలు ఈద్గాలో నమాజులు నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య ప్రార్థనలు చేపట్టారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎలాంటి అల్లర్లు
జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.