మందుబాబులకు ఎస్సై సూచనలు

85చూసినవారు
మందుబాబులకు ఎస్సై సూచనలు
నాగులప్పలపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై బ్రహ్మనాయుడు హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ మండలంలోని అన్ని గ్రామాల్లో సాయంత్రం వేళల్లో పోలీస్ గస్తీ ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారు కనిపిస్తే వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు. ఈ
విషయాన్ని మందుబాబులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్