భూ ఆక్రమణలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో గురువారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు లతో కలిసి అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతి పై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.