సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలోని పొగాకు బోర్డు కేంద్రంలో జరిగిన వేలం కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ కేశంగ్ యాంగ్జామ్ షేర్ప, ఎమ్మెల్యేతో కలిసి పొగాకు నాణ్యతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బోర్డు ED విశ్వ, అధికారులు, బయ్యర్లు, రైతులు పాల్గొన్నారు.