రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, వైసీపీ కావాలనే లేనిపోని విమర్శలు చేస్తుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. బుధవారం నాగులుప్పలపాడు లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కూడా గడవకముందే పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.