ప్రకాశం జిల్లా దోర్నాల ఎస్సై మహేష్ గురువారం పట్టణంలో పలు వాహనాలను తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ప్రతి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి హాని కలిగించే వస్తువులు లేదా పదార్థాలను రవాణా చేయరాదని వాహనదారులకు ఎస్ఐ మహేష్ సూచించారు. ముఖ్యంగా శ్రీశైలం వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.