రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ తుగ్లక్ పాలన సాగించి మళ్లీ విద్యుత్ చార్జీలపై నిరసనలు చేయటం హాస్యాస్పదమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసిపి పై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఏం మొహం పెట్టుకుని నిరసనలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని మోసం చేశారన్నారు.