జులై 1వ తేదీన ఎర్రగొండపాలెంలో ఎన్టీఆర్ పింఛన్ కార్యక్రమాన్ని సోమవారం అధికారులు, నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆయన పర్యటన రద్దు అయినట్లు టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు ఆదివారం తెలిపారు. పింఛన్ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని తెలిపారు.