ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అనంతరం గ్రామాల్లో ఏర్పడుతున్న సంఘటనలు తదితర అంశాలపై నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తలు, నాయకులు కలసి కట్టుగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.